డిజిటల్ పవర్ గా ఎదుగుతున్న భారత్

0
1505

భారత దేశం డిజిటల్ పవర్ గ ఎదగడానికి రంగం సిద్దమైనది. దానికి నాంది పలికింది ఆరోగ్య సేతు అప్ అనే చెప్పాలి. ప్రధాని మోడీ ఆరోగ్య సేతు అప్ ని డోలోడ్ చేసుకోమనడం. అన్ని రాష్ట్రాలు దీన్ని తమ ఫోన్ లో కచ్చితం గా ఉంచుకోవాలని షరతులు పెట్టడమే దీనికి సంకేతం. ఆలా చెయ్యడం ద్వారా ఇప్పుడు ఆరోగ్య సేతు అప్ కి 12 కోట్ల డౌన్లోడ్స్ వచ్చాయి. ఇప్పటికే దాకా ఇలాంటి రికార్డు మన దేశం లో లేదు. పైగా 59 చైనా అప్స్ బాన్ చెయ్యడం ద్వారా మనం డిజిటల్ ఇండియా లో ఇంకొక అడుగు ముందుకు వేసినట్లు అయ్యింది.

టిక్ టాక్ వంటి భారీగా వాడే అప్స్ ని బాన్ చేసామో లేదో రోపోసో, చింగారి వంటి సోషల్ అప్స్ వచ్చేశాయ్. రీసెంట్ గా చింగారి సంస్థ విడుడల చేసిన న్యూస్ అప్డేట్ ప్రకారం బెంగళూరు కి చెందిన ఆ సంస్థ 40 మంది ఉద్యోగులతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఏకం గ 8000 మందిని ఉద్యోగం లో చేర్చుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు. ఈ విధం గ చుస్తే ఈ అప్స్ బాన్ ద్వారా డిజిటల్ ఇండియా ప్రోగ్రాం లో కనీసం వచ్చే సంవత్సరం లోగా లక్ష మందికి ఉద్యోగాలు తద్వారా కోటి మందికి పైగా జనాలు లాభ పడటమే కాక 4 కోట్ల జనాభా దారిద్ర రేఖ ని దాటి ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నట్లు చెప్తున్నారు.

రీసెంట్ గ మన తెలుగు వారు ఐన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఎలిమెంట్ అనే సోషల్ మీడియా అప్ ని లాంచ్ చేసారు. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లాగ ఇది కూడా ఒక చక్కటి అప్ అని. పూర్తిగా భారత దేశ టెక్నాలజీ తో మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగం గ తయారు చేసారని అయన చెప్పారు. ఈ విధం గా చూస్కుంటే చైనా అప్స్ ఏ కాకుండా పూర్తి గ దేశీయ అప్స్ మీద పూర్తి డిజిటల్ ఇండియా కి స్వీకారం చుట్టినట్లు కనిపిస్తుంది. ఇవే కానక నిజం అయితే ఇంకొక 5 ఏళ్లలో పూర్తి గ డిజిటల్ ఇండియా ని చూసే అవకాశం దక్కచు

మేరా భారత్ మహాన్

-KRISHNA (FRONTLINES MEDIA)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here